సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలను చూపిస్తూ కమర్షియల్ హంగులు కలబోసిన సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రాణా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
కాగా రజనీకాంత్ కి ధీటైన విలన్ గా రాణా కనబడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రాణా ప్రతినాయక పాత్రలో నటించిన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ లో కూడా కథానాయకుడికి ధీటైన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రాణా మెప్పించాడు. తాజాగా రజనీకాంత్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి..
వరుస డిజాస్టర్లతో వెనుకంజలో ఉన్న రజినీకాంత్ ని హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రంగా జైలర్ నిలిచింది. దాదాపు 650 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన రజినీకాంత్ తన మార్కెట్ స్థాయిని చాటి చెప్పారు. అనంతరం లాల్ సలామ్ లాంటి డిజాస్టర్ చిత్రంలో నటించారు. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన లాల్ సలామ్ ని ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వెట్టయాన్’ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినటించనున్నారు.