ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన..
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఈ సారి జరగబోయేవి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం యొక్క మొదటి టర్మ్ లోని చివరి అసెంబ్లీ సమావేశాలు..
ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టగా, నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల వాటాపై స్పష్టత రాకపోవడంతో రాష్ట్రం కూడా ఓటాన్ అకౌంట్ ద్వారా ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు, ఉద్యోగుల సాధారణ జీతభత్యాలకి సంబంధించిన ఖర్చులకై ప్రభుత్వం అసెంబ్లీ యొక్క అనుమతి కోరనుంది..
అయితే ఈ బడ్జెట్ సమావేశాలను అధికారపక్షం తమ ఎన్నికల సన్నాహం గా భావించవచ్చు.. ఈ ఐదేళ్లలో తాము చేసిన కార్యక్రమాలు, ప్రగతి గురించి నివేదించే అవకాశాలున్నాయి… సరిగా రిప్రెసెంట్ చేయగలిగితే ప్రజల్లో మరింత సానుకూలత ఏర్పడుతుందని జగన్ సర్కార్ అభిప్రాయం కూడా..
గత ఐదేళ్లలో జగన్ సర్కార్ అసెంబ్లీలో పలు విప్లవాత్మక బిల్లులను పాస్ చేసి చట్టాలుగా రూపొందించింది వాటిలో ముఖ్యమైనవి:
మహిళలకు ప్రతీ నామినేటెడ్ పోస్ట్ లలో 50% రిజర్వేషన్లు కల్పించడం,
బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ లకు నామినేటెడ్ పోస్ట్ లలో 50% రిజర్వేషన్లు,
అన్ని కాంట్రాక్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు,
అన్ని కాంట్రాక్టుల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ లకు 50% రిజర్వేషన్లు,
ఇస్తూ అధికారం లోకి రాగానే ఒక పెద్ద బోల్డ్ స్టెప్ తీసుకుని ఆ చట్టాలను సమర్థవంతంగా అమలు పరిచింది ఈ ప్రభుత్వం.. ఏ చట్టం చేయకున్నా నామినేటెడ్ పోస్ట్ లలో, కాంట్రాక్టు లలో ఎవరినైనా నియమించి ఉండవచ్చు కానీ, చేసే పనిలో చిత్తశుద్దనేది ఉండాలని దానికి చట్టబద్ధత కల్పించింది..
దీనితర్వాత బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం చేసి బిసి కమిషన్ ను ఏర్పాటు చేసింది..
పరిశ్రమలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తుంది…
టీడీపీ హయాంలో మాన్సాస్ ట్రస్ట్ భూములను మెడికల్ కాలేజీ పేరుతో అమ్ముకుని సొమ్ముచేసుకుంది… కానీ ఈ ప్రభుత్వం అలాంటి అవకతవకలకు చోటు లేకుండా చేసేందుకు దేవాదాయ భూముల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ ఆక్ట్ చేసి పటిష్టంగా అమలు చేస్తుంది దానికి నిదర్శనమే ఇంత వరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయ భూములు అన్యాక్రాంతం అవ్వకపోవడమే…
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ను, హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ను ఏర్పాటు చేస్తూ చట్టాలు చేసి విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంది…
మహిళల భద్రతకై వారిపై జరిగే నేరాలను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడానికి చట్టం చేసి ప్రత్యేకంగా దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.. ఈ చట్టం లో ని కొన్ని అంశాలు ఐపీసీ లో కొత్తగా సెక్షన్ 354(ఇ),(ఎఫ్) లను పొందుపరుస్తూ, సీఆర్పీసీ లోని సెక్షన్ 173, 309 లకు సవరణ లు కోరగా కేంద్రం దానిపై అభ్యంతరం వ్యక్తం చేయగా 21 రోజుల్లో మరణ శిక్ష అనే సవరణ అమలుకు నోచుకోలేదు.. కానీ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు మాత్రం ఏర్పాటయ్యాయి..
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు అతిపెద్ద సాహసంతో కూడిన చట్టాన్ని చేసి ఆర్టీసీ విలీన ప్రక్రియని పూర్తి చేసింది…
అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవడానికి చట్టం చేసి. గతంలో జరిగిన అక్రమ అమ్మకాలు, కొనుగోళ్లను నిలిపివేసింది… అసైన్డ్ భూముల పరిరక్షణ కోసం పేదల దగ్గర ఉన్న అరాకొరా భూమిని పెత్తందార్ల బారినుండి కాపాడింది…
సినిమా టికెట్ల విషయం లో నియాత్రణకై చేసిన చట్టం మొదట్లో విమర్శకు గురి అయినా, సినిమా పెద్దల సమావేశంలో జరిగిన చర్చ కారణంగా మరియు కోవిడ్ తర్వాత జరిగిన పరిణామాలు, ఒటిటి వల్ల ఎదురవుతున్న పోటీ దృష్ట్యా జగన్ ప్రభుత్వ నిర్ణయం సరైనదే అని వారు కూడా ఒప్పుకున్న విషయం అందరికీ విదితమే…
కొత్తగా మైనారిటీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ చట్టం చేసి.. వారి హక్కులకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది…
వీటితోపాటు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు చట్టాలు చేసి గ్రామ స్వరాజ్యానికి అడుగులు వేసింది ఈ ప్రభుత్వం…
ఈ ఐదేళ్లలో మొత్తంగా 186 చట్టాలను ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది… ఒక్క రాజధాని బిల్లు లో తప్ప ఇంకెక్కడా పెద్ద ప్రతిఘటన ఎదుర్కోలేదు ఈ ప్రభుత్వం…
ఇదే సమయం లో ప్రతిపక్షం మాత్రం ఎలాంటి నాణ్యమైన వాదన లేకుండా ఎప్పుడూ గందరగోళం శృష్టించాలని, వాకౌట్ లు చేయాలని, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను చెప్పుకోకుండా అడ్డుపడాలని మాత్రమే ప్రయత్నం చేశాయి.. గత టీడీపీ ప్రభుత్వ హయాం లో ప్రతిపక్షానికి మాట్లాడటానికి కూడా మైక్ ఇవ్వకుండా, సమస్యల పై చర్చ జరగకుండా మంత్రులు, ఎమ్మెల్యే లు అంతా జగన్ మోహన్ రెడ్డి ని దూషించడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికి మాత్రమే అసెంబ్లీని వాడుకున్నారు.. తన గొంతు వినపడకుండా చేస్తున్న కుట్రను ఛేదించుకుని అసెంబ్లీ నుండి వాకౌట్ చేస్తూ తన ప్రభుత్వ ఏర్పాటు జరిగాకే అసెంబ్లీ కి వస్తానని దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు, ఎవరికైతే తన వాదన చెప్పుకోవాలి అనుకున్నాడో ఆ ప్రజల మధ్యకే పాదయాత్ర గా వెళ్లి జనాల మెప్పు పొంది సీఎం గా అసెంబ్లీ లో అడుగు పెట్టాడు…
దానిని చూసి స్ఫూర్తి పొందినట్లే బాబు కూడా దానినే కాపీ చేయబోయాడు.. తన భార్యని ఎవరో అవమానపరిచారని, ఈ సభలో నేనుండను అని, సీఎం అయ్యాకే మళ్లీ వస్తా అని శపథం చేసి బయటికి వెళ్లారు.. సరే ప్రజలకి ఇచ్చిన మాట ఎలాగూ నిలబెట్టుకోడు.. కనీసం తనకోసం తను చెప్పుకున్న మాట మీద అయినా నిలబడతాడేమో అనుకున్నారు అందరు, కానీ ఎంఎల్సీ ఎన్నిక కోసం అదే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చాడు.. పోనీ అసెంబ్లీకి రాకపోతే పోయాడు.. జనాల్లో అయినా ఉన్నాడా అంటే అదీ లేదు.. నెలకో రెండు నెలలకో ఎక్కడో ఒకచోట మీటింగ్ పెట్టడం.. కార్యకర్తలను రెచ్చగొట్టడం, దాడులు చేయడం… మళ్లీ ఇంట్లో కూర్చుని కుట్రా రాజకీయాలు చేయడం… శరామాములే… ప్రజల్లో తిరిగితే కదా ప్రజా సమస్యలు తెలిసేది? స్టేజి మీద ఉన్యాసాలు దంచిపోతే సగటు పౌరుని సమస్య ఏమర్థమవుతుంది?
సరే…..
చూద్దాం ఈ ఆఖరి సెషన్ ఎలా నడుస్తుందో, బాబు వస్తాడో? లేక ఎప్పటిలానే ఇంట్లో నుండే నా కుట్రలు అనుకుంటాడో?..
వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ ఈ ఐదేళ్ల చట్టసభ అనుభవంలో నూటికి 90% తృప్తిగానే ఉందని భావించవచ్చు.. తాము చేసిన చట్టాలు, వాటిని చిత్తశుద్ధితో అమలు పరిచిన విధానం వారికి రానున్న ఎన్నికల్లో అస్త్రాలుగా మారనున్నాయనేది వైసీపీ నాయకత్వం లోని బలమైన నమ్మకం…