ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎన్నికలు ఎలా జరగాలి అనీ, పాలన ఎలా జరిగిందనీ, గతంలో ఉన్న పాలకులు ఎలా మోసం చేసారు అనీ ఇలా రకరకాల అంశాలతో వారి వారి అభిప్రాయాలను ఎక్స్, ఫేస్బుక్లలో పోస్టు చేస్తున్నారు.
కాగా ఒక వ్యక్తిని ఒకసారి నమ్మి ఉద్యోగ భాద్యతలు అప్పజెప్పినాక విఫలమైతే రెండో సారి అవే భాద్యతలు అప్పజెప్పాలంటే పూచీకత్తు అడుగుతామనీ, మరి ముఖ్యమంత్రి ఉద్యోగానికి మాత్రం మినహాయింపు ఎందుకనీ, పలుసార్లు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి వాటిని పది శాతం కూడా నెరవేర్చని చంద్రబాబు ప్రస్తుతం ఇస్తున్న హామీలు ఎలా నమ్మగలమనీ…. నెటిజన్లు ఆసక్తిగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆలోచిస్తే… నిజమే దీనికి కూడా పూచీకత్తు కావాల్సిందే కదా అనిపిస్తుంది.
రాబోయే ఎన్నికల్లో ఈసికి సమర్పించే అఫిడవిట్ లో చూపించే చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ హెరిటేజ్ తో సహా ష్యూరిటీగా పెట్టి హామీలు నెరవేర్చని పక్షంలో అవన్నీ ప్రభుత్వ ఖజానాకి చెందేట్టుగా రిజిస్టర్ చేయాలనీ,లేకపోతే బాబు ఇచ్చే హామీలను ఎన్నికల కమిషన్ ఒప్పుకోకూడదనీ, 2014 ఎన్నికల ముందు ఈ హామీలు అన్నీ ఎలా నెరవేరుస్తావు బాబూ అని ఎలెక్షన్ కమిషన్ అడిగితే “నేను విజనరీని సంపద సృష్టించి అమలు చేస్తా” అని బాబు అన్నాడనీ, అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు అలవిగాని హామీల్ని అడ్డుకోవాల్సిన భాద్యత ఎన్నికల కమిషన్ కి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి బాబు ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. ఎప్పుడూ పదవి అయిపోబోతుందన్న నాలుగు నెలల ముందు తూతూమంత్రంగా ఇచ్చేసి, విపరీతంగా పబ్లిసిటీ చేసుకునే వాడు. అదే విషయాన్ని సోషల్మీడియా జనం పట్టుకుని భలే అడుగుతున్నారు. అసలు అన్నింటికన్నా ముందు పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి ఈ హామీలకు భాద్యత వహిస్థాయో లేదో, బిజెపి, జనసేనల నుండీ కూడా వివరణ తీసుకోని వాళ్ళని కూడా భాద్యుల్ని చేయాలనే డిమాండు కూడా సోషలుమీడియా లో ఎక్కువగా వినిపిస్తోంది కూడా!!!