రివర్ ఫ్రంట్ పార్కుకి కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెట్టిన సీఎం విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ ఫేజ్–1పనులకు ప్రారంభోత్సవంతో పాటు, వివిధ ప్రాంతాల్లో రూ.239 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శంకుస్ధాపనలు చేశారు. అనంతరం విజయవాడ పురపాలక సంస్ధ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి […]
కృష్ణలంక ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కి దిగువున ఉన్న కృష్ణలంక కాలనీలో ఉండే 80,000 మందికి ఈ రిటైనింగ్ వాల్ ద్వారా వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి వచ్చే కొద్దిపాటి వరదకే బ్యారేజ్ నుంచే దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి. బ్యారేజ్ నుంచి […]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. ప్రజల దశాబ్దాల కల అయిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం చేస్తారు. కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన భూ పట్టాలకు సంబంధించి శాశ్వత హక్కులు కల్పించారు. దీని […]
‘విజయవాడకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. 2014-29 మధ్య వంద కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఫ్లై ఓవర్లు.. రోడ్లకు కూడా నేనే నిధులు విడుదల చేయించా’ అని ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు . 15 లక్షల మంది జనాభా ఉన్న విజయవాడ గురించి బాబు ఏనాడు పట్టించుకోలేదని, ఇక డ్రామాలు ఆపాలన్నారు. గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదు. వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాను […]
2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు విజయవాడలో 30 ఆలయాలు కూల్చేశారు. జగన్ సీఎం అయ్యాక ఎనిమిది ముఖ్యమైన గుడులను పునఃనిర్మించారు. 2021లో సీఎం శంకుస్థాపన చేయగా రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేశారు. గత డిసెంబర్ 8వ తేదీన భక్తులకు అంకితమిచ్చారు. చంద్రబాబును మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే ఘనుడు. 2015లో గోదావారి పుష్కరాల్లో తన ప్రచారం కోసం 29 మంది భక్తులను […]
ఈ నెల 27న విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపధ్యంలో, ప్రభుత్వం తరుపున నేడు ఉద్యోగ సంఘాలు జేఏసీల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరిపింది.
అసెంబ్లీ టికెట్ల కోసం తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంకా సీట్లను ఖారారు చేయలేదు. ఈ నేపథ్యంలో పోటీ చేసేది మేమే అంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జనసేనానికి పవన్ కళ్యాణ్ మాత్రం తనకేం పట్టనట్లుగా ఉన్నారు. ఎందుకంటే బాబు ఎన్ని సీట్లు ఇచ్చినా చాల్లే అనే భావన […]
విజయవాడ నగర నడిబొడ్డున బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆవిష్కరించారు. దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది.. దాని […]
విజయవాడ, స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ యొక్క మహా శిల్పం ఆవిష్కరణ వేడుక ఆహ్వానం సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ తమ యొక్క సందేశాన్ని విడుదల చేసారు. 81 అడుగుల ఎత్తైన వేదకపై, 125 అడుగుల ఎత్తుతో సుమారు 206 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం గత కొంతకాలంగా నిర్మాణంలో ఉంది. అన్ని ఏర్పాట్లతో సుందర నిర్మాణంతో తయారయిన ఆ విగ్రహావిష్కరణలీ ప్రజలందరూ భాగమవ్వాలని సీయం జగన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ […]
కర్ణాటక నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న అలుగు పొలుసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ఈబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న అలుగు పొలుసులను గుర్తించారు. మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న 57 కిలోల అలుగు పొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ […]