సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊదరగొట్టేవారు. సమ్మిట్లు పెట్టి ఊరుపేరు లేని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న చరిత్ర ఆయనది. రోడ్డుపై చిన్న చిన్న పనులు చేసుకునే వారికి సూట్లు వేసి పారిశ్రామికవేత్తలుగా చూపించారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతను మోసం చేశారు. ఇక బాబు ఏదైనా దేశానికి వెళ్తే […]