ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండేది. అలాంటిది నేడు ఆ కంచుకోట బీటలై పారింది. 2019 ఎన్నికల వరకు బోయలు కురుబలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే నడిచారు. నేడు ఆ కులాలకు చెందినవారు ఒక్కొక్కరు టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బోయలు కురుబలకి సంబంధించి వారు ఓట్లు మాత్రమే కావాలి వాళ్లకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటివి ఏమాత్రం చేయరు. ఉమ్మడి […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్ర లేచిన దగ్గర్నుంచి నేను బీసీల పక్షపాతిని, టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ మాటలు చెబుతూ తీరా వారికి రాజ్యాధికారం ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా చేసే ఎన్నికలు రాగానే వారికి వెన్నుపోట్లు పొడుస్తూ తన సొంత జిల్లాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ తన పార్టీ తరపున ఇద్దరికి అవకాశము ఇచ్చింది. […]
జగన్ వచ్చాక ప్రజలు నిరుద్యోగులు అయ్యారు అనేది ఆయనే, జగన్ పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు అనేది ఆయనే. కాకపోతే రెండూ నిజాలు కాదు. అధికారిక లెక్కలు అబద్ధం ఆడవు… జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు అడిగితే జాబిస్తానని నేనెప్పుడూ అనలేదే అని ప్లేటు పిరాయించాడు. పోనీ నిరుద్యోగభృతి ఇచ్చాడా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే […]
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను […]
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ […]
టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది ఈరోజు వరకు బీసీలు మాత్రమే. మరి ముఖ్యంగా అనంతపురంలో టీడీపీకి కొమ్ము కాసింది బీసీ సామాజిక వర్గం. అలాంటి బీసీలకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనితో విసుగు చెందిన కీలక బీసీ కులాలు టీడీపీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం […]
తన రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని..అది ఏమైనా సంజీవినా అన్నది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా గతంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుక ఎన్ని మడతలు పడిందో రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గతంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఎలా స్పందించారో ఓసారి తొంగి చూస్తే తన రాజకీయ ప్రయోజనాల కోసం […]
ప్రస్తుత ఎన్నికలు డబ్బుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరు అధికంగా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకోగలరో వారికే టిక్కెట్లు కేటాయించారు. అలా కేటాయించిన సీట్లలో ఒకటి అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ కి ప్రభాకర్ చౌదరి ఇంచార్జిగా వుండేవారు. చంద్రబాబు ఎలక్షన్ కి 30 కోట్లు సిద్ధం చేసుకోవాలి అని చెప్పడంతో ప్రభాకర్ చౌదరి తాను అంత పెట్టుకోలేను కానీ తన తరుపున ఓ 20 […]
పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కూటమి తరుపున తిరుపతిలో పోటి చేస్తున్న జనసేన అభ్యర్థికి టీడీపీ నుండి సహకారం లభించడం లేదని, శ్రీకాళహస్తిలో పోటిలో వున్న టీడీపీకి జనసేన నుండి సహకారం లభించడం లేదని వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి అందరి మధ్య సయోధ్య కుదర్చాలని పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి వచ్చారు. ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు జనసేనకు ఎందుకు సపోర్ట్ చెయ్యడం లేదు, మీ చంద్రబాబు నాయుడు […]
సీఎం జగన్ పై విజయవాడ నడిబొడ్డున దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కాగా వైసీపీ శ్రేణులు ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ దాడి అనంతరం తమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. జగన్ తనపై తానే దాడికి వ్యూహం రచించారనే ధోరణిలో టీడీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. గతంలో కోడి కత్తి కేసుకు ముడి పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ప్రారంభించింది. […]