ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పతకాలు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగాల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు నాలుగు కేటగిరీల్లో పతకాలను ప్రకటించారు. మన రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వారిలో కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్జిత్, ఆర్ఎస్ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ అద్దంకి వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ బి.ప్రకాశ్రావు, ఏఎస్ఐ కరి […]