దేశంలో ఈ నినాదం దశాబ్దాల కాలంగా కేవలం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మాటలకు, మీడియా బూటకపు రాతలకు మాత్రమే పరిమితం అయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటినుండి పిల్లలు చదువులు పట్ల వారి భవిష్యత్తు పట్ల చేతల్లో చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వాలను నేతలను మనం ఎప్పుడైనా చూసామా? బహుశా పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా! వారిపై మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది ఆయా ప్రభుత్వాలు, నేతలు, రాజకీయ పార్టీలు ఉద్దేశం కాబోలు. […]