ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్థలాలో అరకుది అగ్ర స్థానం. అందమైన అరకు లోయలలో పరచుకున్న పచ్చదనాన్ని చూడడానికి ఏటా లక్షలాది మంది అరకుని సందర్శిస్తారు. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా పర్యాటక శాఖ చేసే ఏర్పాట్లు కూడా చూపరులను విశేషంగా ఆకట్టుంటాయి. అటువంటి అరకులో సహజ సిద్దంగా ఏర్పడిన గుహల సముదాయం “బొర్రా గుహలు”.1807 విలియం కింగ్ అనే అతను గుర్తించిన ఈ గుహలు సున్నపు రాతితో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినవి. వాతావరణంలోని మార్పులను అనుసరించి ఆ సున్నపురాయి […]