ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల సమయం కూడా లేదు కానీ సీట్లు ప్రకటనలో టీడీపీ వెనుకబడిపోయింది. ఇంకా ఇప్పటి వరకు ఒక అభ్యర్థిని ఖరారు చేయలేక తర్జన భర్జన పడుతోంది. దాంతోపాటు చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడు అనేది కూడా ధర్మ సందేహంగా మారింది. ఇవన్నీ చాలదన్నట్లు టీడీపీ – జనసేన పొత్తులో ఏ పార్టీకి సీట్ కేటాయిస్తే తద్వారా ఎవరు పని చేయరో అని టీడీపీ వర్గాల్లో టెన్షన్ పడుతున్నట్లు రాజకీయ […]
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఏమీ లేదని చాలాసార్లు బాలినేని కొట్టి పారేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. […]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచనలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ముందుపెట్టి ఓట్లు అడుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పొత్తులతో వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ‘మార్పు ఒక పదం మాత్రమే కాదు. మార్పు అంటే మాటివ్వడం. అందుకే ప్రజలు ఎన్నుకునేది జగన్నే’ అనే నినాదాన్ని తెచ్చింది. వైఎస్సార్సీపీ కొత్తగా ప్రారంభించిన క్యాంపెయినింగ్ ఇలా ఉంది. జగన్ […]
జగన్ ప్రభుత్వంపై అక్కసుతో నిలువెల్లా విషం నిండిన కథనాలు రాస్తున్న ఈనాడు మరోసారి తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టింది. నరం లేని నాలుక ఎన్ని వంకరలైనా తిరుగుతుందన్న సామెత చందాన విషం మాత్రమే నిండిన రామోజీ కలం అన్ని వంకరలు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలన్న దుగ్ద తప్ప మరో లక్ష్యమే లేని రామోజీ ఈసారి ఫీజులు పెంచు…. ఖజానా నింపు అనే ప్రభుత్వ వ్యతిరేక కథనాన్ని వండి వార్చాడు. రామోజీ రెండు నాల్కల […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి గందరగోళంగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య వివాదాలు ఆగడం లేదు.. జిల్లాల నుంచి రోజూ అధిష్టానానికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో నాయకులు రచ్చకెక్కి పార్టీ పరువు తీస్తున్నారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. – తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఇటీవల ఫ్లెక్సీల లొల్లి జరిగింది. మాజీ మంత్రి జవహర్పై అచ్చిబాబు వర్గీయులు ఆగ్రహం […]