టీడీపీ కి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు పోటి మీరే అంటూ ఖర్చులు పెట్టించి తీరా ఎలక్షన్ వచ్చే సరికి డబ్బులు ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వారికే టికెట్ అనడంతో టీడీపీ కి ప్రతి జిల్లాలో రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్న రెబల్స్ లేదా గ్రూపు గొడవలతో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు […]
‘నా ఖాజానాలోని కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎవడు పడితే వాడు కట్టలు కట్టలు తీసుకెళ్తున్నాడు. జనంలో మాత్రం పాజిటివ్ వైబ్స్ రాలేదు. అందరూ కలిసి నన్ను ముంచేసేలా ఉన్నారు’ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చిన ఆవేదన ఇది. బడా పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు నెల్లూరు ఎంపీ, భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్లు […]
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలుకు సంబంధించి పిఠాపురంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూటమి నాయకులు ఇప్పటికే చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి ఎస్వీ యస్ యన్ వర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం . పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఈ విధంగా ఉండబోతుంది . ఈ రోజు ఉదయం 9.30 లకు గొల్లప్రోలు వై జంక్షన్ నుంచి […]
ఆంధ్రప్రదేశ్ లో మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఆఖరికి వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెనుకంజ వేస్తూ ఉండటం జనసేన శ్రేణులను నిరాశకు […]
టీడీపీ పార్టీలో అభ్యర్థుల నామినేషన్ లు మొదలైనా ఇంకా అనేక నియోజకవర్గాలలో సీట్ల కుమ్ములాటలు తగ్గడం లేదు. మొన్న అనపర్తి నిన్న మడకశిర ఈరోజు కావలి అసెంబ్లీ సీటు విషయంలో చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా కావలిలో టీడీపీ పార్టీ తమ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించారు. దీనితో మొన్నటి వరకు నియోజకవర్గ ఇంచార్జీగా వున్న పసుపులేటి సుధాకర్ చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాము అని హామీతో గత కొన్ని […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పెత్తందారుల పోకడలను ఓ టీడీపీ ఎన్నారై బట్టబయలు చేసాడు. ఓటర్లను వెధవలంటూ వారిని డబ్బుతో కొనేయమని తన తోటి ఎన్నారైలకు నూరి పోసాడు. ఇప్పుడీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే ఎన్నారై టీడీపీ రీచ్ ఏపీ మీట్ అనే చిన్న సభలో ఎన్నారై యూఎస్ఏ సెల్ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం చేసిన […]
ఏపీలో 2023-24 పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. కాగా ఈ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి కనీవినీ ఎరుగని రికార్డును సాధించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా సబ్జెక్టుల్లో ఆమె వంద శాతం మార్కులు సాధించడం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె సాధించిన మార్కులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా […]
‘పవన్ కళ్యాణ్ రికరెంట్ ఇన్ఫుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నెమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ప్రెస్నోట్ విడుదల చేసిన ప్రెస్నోట్ సారాంశమిది. […]
జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రతి ఊరి నుంచి చిన్నాపెద్దా కదిలారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మండుటెండలను సైతం లెక్క చేయలేదు. సంక్షేమ పథకాలు అందించిన నాయకుడికి సంతోషంగా మద్దతు పలికారు. సమస్యలున్న వారు ఆయనకు చెప్పుకొని పరిష్కారం పొందారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి చేరికలైతే వెల్లువలా జరుగుతున్నాయి. నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులు వైఎస్సార్సీపీ […]
ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా సూరత్ లోక్సభ స్థానం కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు గుజరాత్ బీజేపీ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించింది. వాస్తవానికి సూరత్లో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ అభ్యర్థి […]