ఎన్నికల ప్రచారంలో నాయకులు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి సమయంలో కొంత మంది నాయకులు అత్యుత్యానికి పోయి తమ నోటి దూల మాటలతో కొన్ని వర్గాలను కించ పరిచేలా మాట్లాడుతూ తనకు అలాగే తను ప్రాతినిధ్యం వహించే పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం లోని ముక్తేశ్వరం మాగపువారిపేటలో జనసేన నాయకులు, జనసేన […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రను తలపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నినా ఫలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. గుడివాడ సభ ప్రసంగం హైలెట్గా నిలిచింది. ఇక స్టే పాయింట్ల పార్టీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్ల చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యాత్ర 16వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి […]
ఎన్నికల ప్రచారంలో గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత దూసుకుపోతున్నారు. నిన్నటి వరకు కొవ్వూరు ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన తానేటి వనిత ఇప్పుడు తన సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుండి పోటీ చేయబోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చుట్టి వచ్చారు. మొత్తం 80 గ్రామాలు ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. జగన్ గారు చేసిన సంక్షేమం, అభివృద్ది పనులను ప్రజల్లోకి […]
తన రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని..అది ఏమైనా సంజీవినా అన్నది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా గతంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుక ఎన్ని మడతలు పడిందో రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గతంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఎలా స్పందించారో ఓసారి తొంగి చూస్తే తన రాజకీయ ప్రయోజనాల కోసం […]
వివేకా హత్య కేసు వ్యవహారం పై జరుగుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. చూసి చూసి జనాలకే విసుగొచ్చింది. అందుకే కేస్ డిటేల్స్ గురించి గానీ, పాత క్యాసెట్ మళ్లీ వినిపించి మళ్లీ మళ్లీ హింసించే ఉద్దేశం లేదు. సీదా పాయింట్ కి వస్తే:… నిన్న వివేకా హత్య ఉదంతంపై సీబీఐ సేకరించిన వీడియో లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది, రక్తపు మడుగులో ఉన్న […]
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. సీఎం జగన్పై దాడి జరగడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. జగన్పై దాడి జరిగిన ప్రదేశంలోని సెల్ లొకేషన్ టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ పై […]
ప్రస్తుత సమాజంలో చాలామంది అనుకున్నది జరగలేదని లేదా పక్కన వాళ్ళతో పోల్చుకుని ఒక నైరాస్యమైన జీవితాన్ని అలవాటు పడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో పోల్చుకుని నాకు అలా ఉంటే లేదా ఇలా ఉంటే నేను ఏదైనా సాధించే వాడిని ఎంత దాకా అయినా తెగించి పోరాడేవాన్ని అంటూ తమని సమర్థించుకుంటూ కాలం గడుపుతుంటారు. కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం మన స్థితిగతులు ఎలా ఉన్నా మన పరిస్థితులు ఏమైనా ఎలాంటి దుస్థితిలో ఉన్నా సంకల్పం గొప్పదైతే ఏ […]
‘పిఠాపురం నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాశ్వత నివాసం. ఇక్కడ సొంతింటిని నిర్మించే పనిలో ఉన్నారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాలు, సమావేశాల కోసం మినహా మిగిలిన సమయమంతా నియోజకవర్గంలోని ఇంట్లో అందుబాటులో ఉంటారు’ అని ఆయన సోదరుడు, సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వ్యాఖ్యానించారు. పిఠాపురం మండలం కుమారపురంలో ఈ మాటలన్నారు. సేనానిని గొప్ప వ్యక్తిగా చిత్రీకరించేందుకు అటు చిరంజీవి.. ఇటు నాగబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ అసలు వ్యక్తి […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని మరో మాజీ మంత్రి కడప జిల్లాలో సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి ఆరోపించారు. తనకు కమలాపురం టికెట్ ఇస్తానని టీడీపీలో చేర్చుకుని నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ కేటాయించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కో సీటుకు చంద్రబాబు నాయుడు 20 కోట్ల నుండి 30 కోట్లు వసూలు చేశారు . మా కమలాపురం నియోజకవర్గంలో టికెట్ కేటాయించిన వ్యక్తి నా స్వగ్రామంలో ప్రచారానికి వచ్చినా, […]
ఎన్నికల నామినేషన్లు వేయడానికి రెండు రోజులు సమయం కూడా లేదు కూటమిలో సీట్లు పంచాయతీ ఇంకా తెగలేదు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజెపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అభ్యర్థులు ఖరారు అయినప్పటికీ కూటమిలో సీట్లు రాని అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ముగిసేదాకా సీటు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాము అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. విశాఖ పార్లమెంట్ సీటు కోసం జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. […]