జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాట, వీర మహిళలు పై దాడి జరుగుతున్న వేళ సేనాని నుంచి స్పందన కరువైంది. మొన్న జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు, ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అని ప్రకటించాక పిఠాపురం నియోజక వర్గ స్థాయిలో సమీక్ష జరిగితే నియోజక వర్గ ఇంఛార్జి శేషు కుమారికి ఆహ్వానం లేదు, 2019 ఎన్నికలలో ఈమె పోటీ చేసింది. నిన్న విశాఖ […]
పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్. రాజకీయాల్లోకి వచ్చ సరికి కన్ఫ్యూజన్ స్టార్గా మిగిలిపోయాడు. ఆయన జనసేన అనే పార్టీకి అధ్యక్షుడనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం సేనాని వేస్తున్న అడుగులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడం కష్టమే అనిపిస్తోంది. సేనానికి స్థిరత్వం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ ఉంది. ఆయన చేష్టలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. 2014లో పార్టీ పెడితే ఇంత వరకు పోటీ చేయడానికి తనకంటూ ఒక నియోజకవర్గం […]
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముడురోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ లో 385 యఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.3.14 లక్షల రాజకీయ ప్రచార చిత్రాలను కూడా ఈ సంధర్భంగా తొలగించామని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ మీనా వెల్లడించారు. మూడున్నర కోట్ల విలువైన రాజకీయ పార్టీల మెటీరియల్ను సీజ్ చేసింది. అందులో ఎనభై లక్షల నగదు, కోటిన్నర విలువైన మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం అమ్మకాలు, నిల్వలపై నిఘా వేసామని, గత ఏడాది […]
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ జారీ చేశారు. తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించుచున్న చక్రి రాజశేఖర్ PC-2514 అను కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భాకరాపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం ఇచ్చిన హామీల […]
మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తానని లోకేష్ హామీ ఇచ్చాడు.. గత చరిత్ర చూస్తే టీడీపీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు లాంటివి. ఒక్కో కులానికి అరడజను చొప్పున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి మేనిఫెస్టో ని టీడీపీ వెబ్సైట్ నుండి తొలగించిన చరిత్ర వారిది. ఇక చేనేతల విషయానికి వస్తే, చేనేతలకు ఇల్లు షెడ్డు కలిపి ఒకే చోట నిర్మిస్తాం అని యువగళం లో పలుమార్లు హామీ […]
‘నా ఆఫీసు అమరావతి ట్విన్ టవర్స్లో ఉంది. దాని ముందు బుర్జ్ ఖలీఫా పనికిరాదు. చంద్రన్నలా ఠీవిగా నిలబడి ఉంటుంది. వందో అంతస్తులో ఉన్న మా కార్యాలయానికి రోజూ వెళ్లి వస్తుంటా. డే అంతా అక్కడే గడిపేస్తా. బాల్కనీ నుంచి చూస్తే ఆ సెక్రటేరియట్, బుల్లెట్ రైలు స్టేషన్, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జిలు, ఆ పచ్చదనం.. చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఇక టవర్స్లో హోటళ్లు, మూవీ థియేటర్లు, బార్లు.. అబ్బో చాలా ఉంటాయిలే’ […]
‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగింది. భవిష్యత్లోనూ జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీసీల సమస్యలపై 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. సుమారు 12 వేల ఉద్యమాలకు నాయకత్వం వహించా. ఫలితంగా రెండు వేల జీఓ విడుదలయ్యాయి. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. […]
ఎన్నికలు మొదలయ్యాలంటే చాలు గంట పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంది. గంట ప్రత్యేకత ఏంటంటే గతంలో తాను పోటీ చేసిన సీట్ నుంచి పోటీ చేయరు. ఎన్నికలు ప్రక్రియ మొదలయ్యేది ఆలస్యం కొత్త సీటు కోసం వెతికి ప్రయత్నంలో గంటా శ్రీనివాస్ రావు ఉండిపోతాడు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంట ప్రస్తుతం తన కన్ను భీమిలిపై పడింది. కానీ టిడిపి అధిష్టానం భీమిలి నియోజక వర్గం సీట్ కేటాయించడం కుదరదు ,విజయనగరం […]
రాజకీయాల్లో క్విడ్ ప్రో కో సర్వసాధారణంగా వినిపించే విషయం. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక వాహనం విషయంలో క్విడ్ ప్రో కో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. తాజాగా టీ టైమ్ ఉదయ్ ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆ సీటు విషయంలో పవన్ […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాలేదని, పరిశ్రమలు ఏర్పాటు కాలేదని చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఊదరగొడుతూ ఉంటుంది. ఇక ఎల్లో మీడియా ఈ అంశంపై చేసే దుష్ప్రచారానికి అంతే లేదు. కానీ అదంతా వాస్తవం కాదు. జగన్ హయాంలో రాష్ట్రం గణనీయమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మన రాష్ట్రం 98.3 శాతం స్కోర్తో మొదటి స్థానంలో […]