‘ఓ లంచాల బాబు.. ఓ జన్మభూమి కమిటీల బాబు.. నీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబూ.. చెప్పవయ్యా.. ఏనాడైనా ప్రజలకు మంచి చేశావా?’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. వచ్చే 5 ఏళ్లు […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దాపురంలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీకి టికెట్ దక్కలేదని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా వున్నారు. ఇప్పుడు పెద్దాపురం టీడీపీ కీలక నాయకులయిన తోట సుబ్బారావు, ముత్యాల శ్రీనివాస్, జనసేన గోపాల్ లు తమ పార్టీలకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. తోట సుబ్బారావు తండ్రి కాకినాడ ఎంపీగా రెండు సార్లు పని చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా పని […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం నాయకులకు దిక్కు తోచడం లేదు. గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నారు. మొన్నటి వరకు అధినేత చంద్రబాబు నాయుడే వలంటీర్లను తిట్టి తిట్టి.. ఇప్పుడు వారి ఓట్ల కోసం దిగజారిపోయాడు. అండగా ఉంటానని, నెలకు రూ.10 వేలు ఇస్తానని మాయమాటలు చెప్పాడు. మొన్నటి వరకు వ్యతిరేకించిన టీడీపీ నాయకులు నేడు నియోజకవర్గాల్లో వారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ సేవా సైన్యం ఇవేమీ నమ్మకుండా తమ పోస్టులకు రాజీనామాలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతున్నారు. […]
‘ఐదేళ్ల పాలనలో జగనన్న అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. రాష్ట్ర ప్రజానీకం ఆయన వెంటే ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. శనివారం అనకాపల్లి జిల్లా చింతపాళెంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారు. […]
పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని ఓడించాలనే దృఢ నిశ్చయంతో కూటమిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి ఎప్పటికప్పుడు హైదరాబాద్ తుర్రుమంటూ ఎన్నికల ప్రచారానికి కూడా ఎగనామం పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ పర్యటనలో జాగ్రత్తలు పాటించాలంటూ జనసేన అభిమానులను కోరింది. రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని […]
– వంగవీటి రాధాకు అవకాశం? తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా తలనొప్పిగా మారాడు. చెప్పిన పని సక్రమంగా చేయకుండా పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేశాడని మండిపడుతున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసింది ఉమా మనుషులేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం టీడీపీ మెడకు చుట్టుకోవడంతో బాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సీఎంపై దాడి చేయించాలని ఉమాకు చెప్పించింది చంద్రబాబేనని ప్రచారం ఉంది. అయితే […]
మెగా బ్రదర్స్ ఎంతటి అవకాశవాదులో మరోసారి బయటపడింది. వారంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నారని స్పష్టమైంది. బాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాడిన పదాలే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ […]
2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే త్వరలో జరగబోయే 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీకి ప్రెస్టేజియస్ గా మారాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ జట్టు కట్టడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నెలకొల్పడంతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మమకారాన్ని పెంచుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం వైయస్ జగన్ మేమంతా సిద్ధం […]
– చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మతవిశ్వాసాలపై ఒకటే చెప్పారు. ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం ఉండాలన్నారు. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులున్న ఈ దేశంలో ఏకాభిప్రాయం అనేది ముఖ్యమని చెప్పారు. బీజేపీ అమలు చేసే యూనిఫాం కామన్ సివిల్ కోడ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ స్టాండ్ ఏంటో 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకిగా ఆయన పనిచేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ […]
నారా లోకేష్ ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. అవును మీరు చదివింది నిజమే… 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత త్వరలో జరగబోయే అనగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న నారా లోకేష్ తన ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. మరో కపక్క ఉదయం నుంచి ఎల్లో మీడియా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు నారా లోకేష్ 10,000 బైకులతో ర్యాలీ గా వెళ్లి నామినేషన్ […]