ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తుపాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్షించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరాలను అందించారు.
బాధితుల పట్ల సానుభూతి చూపండి.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మార్గ నిర్దేశం చేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయని చెప్పిన జగన్ కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్రస్ధాయిలో మంచిగా పనిచేశారన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై అధికారులు దృష్టిపెట్టాలని బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆకాక్షించారు. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయంఅందేలా పనిచేయాలని, పరిహారం అందించడంలో సానుభూతితో ఉండాలని ఆదేశించారు.
సాయంలో లోటు రాకూడదు.
తుఫాన్ కారణంగా వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇచ్చే విషయంలోనూ, వర్షాలు కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి చూసుకునే విషయంలోనూ, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలోనూ వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలని రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని సీఎం జగన్ వెల్లడించారు.
ప్రతీ దశలో రైతుకు అండగా నిలవండి
పంటపొలాల్లో చేరిన వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించిన సీఎం జగన్ అది అత్యంత ప్రాధాన్య అంశంమని వివరించారు. రైతులకు ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలబడుతుందని వారు అధైర్య పడాల్సిన పనిలేదని ఖచ్చితమైన భరోసా ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుందని 80శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు…
యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్ను పునరుద్ధరించి, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
ఉద్యోగులకు అండగా ఉంటాం..
గ్రామాల్లో ఉన్న వాలంటీర్ దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్ధాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ,ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్ధైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని సీఎం జగన్ వెల్లడించారు.