ఆంధ్ర ప్రదేశ్ రాజకీయా ల గురించీ అవగాహన వున్న వారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అందరికి సుపరిచితడు..తన రాజకీయా పోకడలతో ఎప్పుడూ మీడియా లో కనపడే వ్యక్తి. రఘురామకృష్ణంరాజు 2019 లో వైసీపీ లో జాయిన్ అయ్యి నర్సాపురం ఎంపీ గా నిలబడి గెలిచారు. అటు తర్వాత వైసీపీ లో తనకూ తగినంత ప్రాధన్యత లభించడం లేదు పబ్లిసిటీ తగినంత లభించడం లేదు అని సీఎం జగన్ మీద అలాగే పార్టీ కీలక నేతల మీద కీలక వ్యాఖ్యలు చేస్తూ మీడియా లో ఎప్పుడూ తాను వుండేలా చూసుకున్నారు.
అదే టైం లో తన బిజినెస్ లో జరిగిన అవకతవకలు మీద కేసులు నమోదయ్యి దోషిగా తేలాడు. ఈ విషయంలో జగన్ నుండి తనకూ సపోర్ట్ దక్కలేదు అని జగన్ కు వైసీపీ పార్టీ కీ దూరంగా జరిగి విమర్శలు చెయ్యడం మొదలు పెట్టారు. దానితో తనకూ టీడీపీ అనుకూల మీడియాలో తగినంత పబ్లిసిటీ దొరికింది. అప్పటి నుండి ప్రతి వారం తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ ను తిట్టడం మొదలు పెట్టారు. కరోనా టైమ్ లో వీడియోలు తీసి ప్రజల మీదకు వదిలే వారు.
ఇలా రాను రాను పార్టీ లోనే వున్నాను అంటూ వైసీపీ పార్టీని అటు జగన్ ను తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. తన విమర్శల మీద, వివాదాస్పద వ్యాఖ్యల మీద కేసులు ఏపీలో నమోదయ్యి , ఏపీ కి రాకుండా అటు హైదరాబాద్ మరియు ఢిల్లీలో వుంటూ వచ్చారు. తన ఆర్ధిక అక్రమాల కేసుల విషయంలో సహాయం చేసిన టీడీపీ తో అంటకాగుతున్న విధానాన్ని పార్లమెంట్ స్పీకర్ కు వైసీపీ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు, అయితే బిజేపి లో తనకున్న పరిచయాలతో, చంద్రబాబు అండతో తన మీద చర్యలు తీసుకోకుండా చూసుకుని ఇటు ఏపీ కి రాకుండా తిరుగుతున్నారు.
ఇక ఎలక్షన్ టైమ్ వచ్చిందీ తాను ఏదోక పార్టీ తరుఫున పోటీ చెయ్యాలి.
తాడేపల్లి గూడెం లో పవన్ కళ్యాణ్, బాబు కలిపి ఏర్పాటు చేసినా జెండా సభలో పాల్గొని నర్సాపురంలో నేనే పోటి చేస్తున్నా . ఏ పార్టీకి నర్సాపురం ఎంపీ సీటు వస్తుందో అ పార్టీ తరుపున పోటీ చేస్తా అని సెలవిచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు గురించి తెలుసుకున్న బిజెపి తమ పార్టీలోకి జాయిన్ చేసుకోము అంటూ చెప్పరు, అలాగే జనసేన తాను నర్సాపురం లో పోటీ చెయ్యడం లేదు కాబట్టి మా పార్టీలో కి వద్దు అంటూ చెప్పింది. ఇక మిగిలిన టీడీపీ పార్టీ తమ పార్టీలోకి జాయిన్ చేసుకోకుండా అలాగే ఏ విషయం చెప్పకుండా వుంది..
దీనితో రఘురామకృష్ణంరాజు కు ఒక పార్టీ లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజలు, అటూ మీడియా ప్రతినిధులు తెలుసుకోవాలి అనుకుంటున్నది రఘురామకృష్ణంరాజు ఇంతకూ నీది ఏ పార్టీ??