2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ప్రకటన తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తర్వాత అది తార స్థాయికి చేరింది. కూటమిలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం అని సంకేతాలు వాల్లే పంపుతున్నారు.
కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి మొదట భాను ప్రకాష్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి రత్న ప్రభకి టికెట్ ఇస్తాం అని తెలిపారు. కాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వర ప్రసాద్ ను బీజెపీలో జాయిన్ చేసుకొని వర ప్రసాద్ కి టికెట్ కేటాయించడంతో బీజెపీ అధిష్టానం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. పార్టీకి పని చేసిన వారికి టికెట్ కాకుండా కొత్త వారికి కేటాయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాగా వరప్రసాద్ కి వైసిపి రానున్న ఎన్నికలకు టికెట్ నిరాకరించడంతో మొదట చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు సూచనలు మేరకు బిజెపిలో జాయిన్ అయ్యి తిరుపతి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. వరప్రసాద్ కి టికెట్ కేటాయించడంతో రత్నప్రభ, సుబ్రహ్మణ్యం సహకరించమని తేల్చి చెప్పారు.
కూటమి పొత్తుల్లో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీట్ ను జనసేనకి కేటాయించారు. జనసేన నుంచి మొదట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ఊహాగానాలకు తెర లేపారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయని పక్షంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ పోటీ చేస్తారని సమాచారం అందించారు. ఒకవేళ హరిప్రసాద్ పోటీ చేయని పక్షంలో జనసేన తిరుపతి అధ్యక్షుడు కిరణ్ రాయల్ పోటీ చేయాలని భావించాడు. కిరణ్ రాయల్ కే టికెట్ దక్కుతుందని అందరూ భావించారు కానీ జనసేన తిరుపతి టికెట్ ను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులును జనసేనలోకి జాయిన్ చేసుకొని టికెట్ కేటాయించారు. ఒక సందర్భంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేనలో జాయిన్ అయ్యి జనసేన తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. అన్నిటికీ తెరతీస్తూ పవన్ కళ్యాణ్ శ్రీనివాసులకి టికెట్ కేటాయించాడు. శ్రీనివాసులకి టికెట్ కేటాయించిన తర్వాత తిరుపతి జనసేన కార్యకర్తలు ఎవరు సహకరించమని తేల్చి చెప్పారు . తిరుపతి మొత్తం లోకల్ నాన్ లోకల్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సుగుణమ్మ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీనివాసులుపై మా పార్టీ అవినీతి ఆరోపణలు చేసింది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన తిరుపతి సీటుకు ఆయన్నే పోటీకి ఎలా దింపుతున్నామని కూటమిని ప్రశ్నించారు. ఆధ్యాత్మిక రాజధానిలో తమకు వాటా లేదని తెలుగుదేశం పార్టీ భావించడం దురదృష్టకరం అని, తిరుపతి బ్యాలెట్ పేపర్లలో కూడా మా ఐకానిక్ సైకిల్ గుర్తు ప్రచార సన్నివేశం నుండి పోతుంది అని సుగుణమ్మ అన్నారు. ఇలా సీట్లు కేటాయింపు జరిగిన తర్వాత కూటమి అభ్యర్థులు నుంచే వ్యతిరేకత రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అభ్యర్థులు ఉన్నారు.