2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయినా తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు అసెంబ్లీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఈ విధంగా ఉంది , ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖపట్నం నార్త్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు , అరకు వ్యాలీ నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివ కృష్ణంరాజు, కైకలూరు నుంచి మాజీమంత్రి మాజీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ నుంచి మాజీ రాజ్యసభ ఎంపీ వైస్ సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బుజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వై సత్య కుమార్, ఆదోని నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో బిజెపితో సహా అన్ని పార్టీల అసెంబ్లీ అభ్యర్థులకు సంభందించి ప్రకటన పూర్తి అయినట్టే .
కాగా నిన్నటి నుండీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీల ఆదినాయకులు ప్రచార పర్వం కూడా మొదలెట్టారు, ఈ విషయంలో బిజెపి, జనసేన ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారానికి సన్నద్ధతలో వెనక పడి ఉన్నారని చెప్పొచ్చు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన అభ్యర్థులకు ఘన విజయం చేకూరాలని కోరుకుంటూ అభ్యర్థులందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియచేస్తుంది#AbkiBaar400Paar#PhirEkBaarModiSarkarpic.twitter.com/yXJVbUolYs